Telangana: తెలంగాణలో కొత్తగా 453 కరోనా పాజిటివ్ కేసులు

Telangana corona positive cases and deaths details
  • గత 24 గంటల్లో 80,658 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 68 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 8,242 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 80,658 కరోనా పరీక్షలు నిర్వహించగా, 453 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 68 కేసులు వెల్లడి కాగా, కరీంనగర్ జిల్లాలో 43, వరంగల్ అర్బన్ జిల్లాలో 36 కేసులు గుర్తించారు. వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 614 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,49,859 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,37,789 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,242 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,828కి చేరింది.
Telangana
Corona Virus
New Cases
Positive
Deaths

More Telugu News