ఉమాను దారి మళ్లించి దాడి జరిగే చోటుకు పోలీసులే పంపించడం హేయం: చంద్రబాబు
- గొల్లపూడిలో దేవినేని ఉమ నివాసానికి వెళ్లిన చంద్రబాబు
- ఉమ కుటుంబానికి పరామర్శ
- పార్టీ అండగా ఉంటుందని భరోసా
- పోలీసులు దిగజారి పనిచేస్తున్నారన్న చంద్రబాబు
పోలీసులు ఇంతగా దిగజారి పనిచేయడం ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు విమర్శించారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఉమ ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు ఏంచేశారని నిలదీశారు. కొండపల్లి నుంచి తిరిగొస్తున్న ఉమాను దారి మళ్లించి దాడి జరిగే చోటుకు పోలీసులే పంపించడం హేయమని అభివర్ణించారు. ఇలాంటి దాడులకు టీడీపీ భయపడబోదని, పోరాటాలు ఆపేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.