CM Ramesh: కొత్త లగ్జరీ విమానానికి పూజా కార్యక్రమాలు నిర్వహించిన సీఎం రమేశ్

  • వీడియో వైరల్
  • కడప ఎయిర్ పోర్టులో లగ్జరీ ప్లేన్
  • కొబ్బరికాయ కొట్టిన సీఎం రమేశ్
  • ఆపై విమానంలో ప్రవేశం
  • అది సీఎం రమేశ్ ప్లేన్ అంటూ ప్రచారం
CM Ramesh attends new plane opening ceremony at Kadapa airport

సీఎం రమేశ్ సన్నిహితుడు ఒకరు కొత్తగా లగ్జరీ విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆ విమానానికి సీఎం రమేశ్ కడప ఎయిర్ పోర్టులో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లాంఛనంగా కొబ్బరికాయ కొట్టారు. ఆపై విమానంలోకి ప్రవేశించారు. కాగా, ఈ విమానం సీఎం రమేశ్ దేనంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. సీఎం రమేశ్ చాలా రిచ్ అని, ఆయన సొంతంగా చిన్న విమానం కొనుగోలు చేశారంటూ కథనాలు వచ్చాయి. అంతేకాదు, రాజకీయపరమైన విమర్శలు కూడా వినిపించాయి.

దీనిపై సీఎం రమేశ్ ప్రతినిధులు స్పందించారు. ఆ విమానం సీఎం రమేశ్ కు చెందినది అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని స్పష్టం చేశారు. ఆ విమానాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దానికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో సీఎం రమేశ్ ను కూడా ఆహ్వానించారని వెల్లడించారు. విమాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లిన సీఎం రమేశ్ సంప్రదాయాలను అనుసరించి కొబ్బరికాయ కొట్టారే తప్ప, విమానం ఆయనది కాదని ఓ ప్రకటనలో వివరించారు.

More Telugu News