Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • నిన్న  51,667 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445
  • మృతుల సంఖ్య మొత్తం 3,93,310
  • మొత్తం  30,79,48,744 వ్యాక్సిన్ డోసులు
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో నిన్న 51,667 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 24 గంట‌ల్లో 64,527 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 1,329 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,93,310కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,28,267 మంది కోలుకున్నారు. 6,12,868 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం  30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేశారు.  
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,95,68,448 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,35,781 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News