Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • నిన్న 62,480 క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,62,793
  • మృతుల సంఖ్య మొత్తం 3,83,490
  • 26,89,60,399 మందికి వ్యాక్సిన్లు  
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో నిన్న 62,480 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 88,977 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,62,793కు చేరింది. మరో 1,587 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,83,490కు పెరిగింది.

ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,85,80,647 మంది కోలుకున్నారు. 7,98,656 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇక వ్యాక్సినేషన్ కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 26,89,60,399 డోసులు ఇవ్వడం జరిగింది.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,71,67,696 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,29,476 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News