YS Sharmila: ఇది మా తొలి విజయం: షర్మిల

  • ఉద్యోగాల కోసం ఆత్మహత్యకు యత్నించిన యువకుడు
  • పరామర్శించేందుకు వెళ్లిన షర్మిల
  • ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆగ్రహం
  • ఉద్యోగం పేరుతో బాధిత కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపణ
ITs my first victory says ys sharmila

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామానికి చెందిన యువకుడు నీలకంఠం సాయి ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. తెలంగాణలో ఉద్యోగ నోటిషికేషన్ల విడుదల కోసం పోరాడుతున్న వైఎస్ షర్మిల ఆ విషయం తెలిసి పరామర్శించేందుకు నిన్న వెళ్లారు.

 అయితే, యువకుడి ఇంటికి తాళం వేసి ఉండడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనను కలవ వద్దని టీఆర్ఎస్ నేతలు బాధిత యువకుడి కుటుంబాన్ని బెదిరించారని ఆరోపించారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని ఎక్కడికో తరలించారని ఆరోపించారు. ఇది తమ తొలి విజయమని షర్మిల అభివర్ణించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది ప్రాణత్యాగం చేశారని, వారి కుటుంబాలను ఆదుకుంటామన్న కేసీఆర్ ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చింతలపాడు మండలంలోని దొండపాడు వెళ్లి ఇటీవల కరోనాతో మృతి చెందిన వైసీపీ నేత, ఏపీ బేవరేజెస్ కోఆర్డినేటర్ గున్నం నాగిరెడ్డి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు.

More Telugu News