Maoist Leader: విశాఖ ఎన్ కౌంటర్లో కీలక మావోయిస్టు నేత మృతి

  • కాల్పులతో దద్దరిల్లిన విశాఖ మన్యం 
  • గ్రేహౌండ్స్ కాల్పుల్లో ఆరుగురు మావోల మృతి
  • ప్రాణాలు కోల్పోయిన డీసీఎం సందె గంగయ్య
Maoist leader Sande Gangaiah dead in encounter

విశాఖ మన్యం ఈరోజు కాల్పులతో దద్దరిల్లింది. కొయ్యూరు మండలం తీగలం మెట్ట అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. వీరిలో మావోయిస్టు కీలక నేత సందె గంగయ్య ప్రాణాలు కోల్పోయారు. డీసీఎం (డిప్యూటీ కమాండర్ ఫర్ మెయింటెనెన్స్)గా గంగయ్య కొనసాగుతున్నారు.

ఈ ఎన్ కౌంటర్ దట్టమైన అటవీ ప్రాంతంలో చోటు చేసుకోవడంతో... పూర్తి వివరాలు వెల్లడి అయ్యేందుకు సమయం పడుతోంది. మరోవైపు ఈ ఎన్ కౌంటర్ నుంచి కొందరు కీలక మావో నేతలు తప్పించుకున్నట్టు సమాచారం. తప్పించుకున్న మావోల కోసం హెలికాప్టర్ సాయంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

More Telugu News