N Rangasamy: పుదుచ్చేరి సీఎం రంగస్వామికి కరోనా.. చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

  • ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
  • ఆయనతోపాటు మరో 11 మందికీ సోకిన మహమ్మారి
  • చికిత్స కోసం చెన్నై వెళ్లారన్న అధికారులు
Puducherry CM Tests Corona positive

ఇటీవలే పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్.రంగస్వామి నిన్న కరోనా బారినపడ్డారు. ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి నిన్న పరీక్షలకు వెళ్లిన ముఖ్యమంత్రికి కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు నిన్న సాయంత్రమే బయలుదేరి వెళ్లారని అధికారులు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఆయనతోపాటు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన 11 మందికి కూడా వైరస్ సంక్రమించినట్టు తెలుస్తోంది.

More Telugu News