Punjab Kings: ముంబయితో మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్

  • ఐపీఎల్ నేడు ముంబయి వర్సెప్ పంజాబ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
  • చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్
  • విజయం కోసం తహతహలాడుతున్న పంజాబ్
  • ఇప్పటిదాకా 4 మ్యాచ్ లు ఆడి ఒక విజయం
Punjab Kings won the toss and opts fielding against Mumbai Indians

ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి కేవలం ఒక్కదాంట్లోనే గెలిచిన పంజాబ్ జట్టుకు ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం.

 ఈ క్రమంలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి ముంబయిని తక్కువ స్కోరుకే కట్టడి చేసి, ఆపై లక్ష్యఛేదనలో సఫలం కావాలని కోరుకుంటోంది. అటు ముంబయి జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి రెండింట గెలిచింది.

ఈ మ్యాచ్ కోసం ముంబయి జట్టులో ఎలాంటి మార్పులు లేకపోగా... పంజాబ్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ని జట్టులోకి తీసుకుంది.

More Telugu News