Shyam Singaray: ఆరున్నర కోట్లతో హైదరాబాదులో 'కోల్ కతా' ఆవిష్కారం... షూటింగ్ జరుపుకుంటున్న 'శ్యామ్ సింగరాయ్'

  • నేచురల్ స్టార్ నాని హీరోగా శ్యామ్ సింగరాయ్
  • రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో చిత్రం
  • కథనాయికలుగా సాయిపల్లవి, మడోనా సెబాస్టియన్, కృతిశెట్టి
  • హైదరాబాదులో ఆఖరి షెడ్యూల్
Shyam Singaray shoot continues in Kolkata set in Hyderabad

నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, మడోనా సెబాస్టియన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాదులోనే జరుగుతోంది. రూ.6.5 కోట్ల వ్యయంతో నిర్మించిన కోల్ కతా సెట్ లో తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

10 ఎకరాల్లో అవినాశ్ కొల్లా రూపొందించిన ఈ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ చిత్రం నాని కెరీర్ లోనే హై బడ్జెట్ మూవీ అని చెప్పాలి. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

More Telugu News