Coronavirus App: తెలంగాణలో కొత్త‌గా 684 కరోనా కేసులు

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,889
  • కోలుకున్న వారు 3,01,227 మంది
  • మృతుల సంఖ్య 1,697
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 184 మందికి క‌రోనా  
   Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా  684 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 394 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,889 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,01,227 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,697గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 4,965 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,873 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 184 మందికి క‌రోనా సోకింది.

తెలంగాణ‌లో క‌రోనా కేసుల పూర్తి వివ‌రాలు...
 

More Telugu News