టీఎంసీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు.. విధ్వంసం సృష్టించిన బీజేపీ కార్యకర్తలు
- టికెట్ల కేటాయింపు విషయంలో కార్యకర్తల అసంతృప్తి
- పార్టీ కార్యాలయాల్లో విధ్వంసం, ఫర్నిచర్ ధ్వంసం
- నష్ట నివారణ చర్యల్లో అమిత్ షా
విషయం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసోం నుంచి నేరుగా కోల్కతా చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర నేతలకు చీవాట్లు పెట్టారు. కేంద్రం నుంచి సీనియర్ నేతల బృందాన్ని రప్పించి అసంతృప్తి రగులుకున్న ప్రాంతాలకు పంపారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఐదుగురు నేతలను పిలిచి సమస్యపై చర్చించాలని, పరిస్థితిని అదుపు చేయాలని ఆదేశించారు.