Revanth Reddy: రేవంత్ రెడ్డి విన్నపంపై నిర్ణయాన్ని వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

  • ఓటుకు నోటు కేసులో విచారణ ఎదుర్కొంటున్న రేవంత్
  • నెల రోజుల పాటు విచారణను వాయిదా వేయాలంటూ పిటిషన్
  • ఉద్దేశపూర్వకంగానే విచారణను జాప్యం చేస్తున్నారన్న ఏసీబీ
ACB Court adjourns its decision in Revanth Reddys petition

ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసు విచారణను నెల రోజుల పాటు వాయిదా వేయాలని ఏసీబీ కోర్టులో రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది.

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఏప్రిల్ 8 వరకు విచారణను వాయిదా వేయాలనే రేవంత్ అభ్యర్థనను తిరస్కరించాలని ఈ సందర్బంగా కోర్టును ఏసీబీ కోరింది. ఉద్దేశ పూర్వకంగానే కేసు విచారణను రేవంత్ జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ఇరువైపు వాదనలను విన్న కోర్టు తన నిర్ణయాన్ని ఈనెల 15కు వాయిదా వేసింది.

More Telugu News