విపక్షాల ఆందోళనలతో లోక్ సభ రేపటికి వాయిదా
- వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సభ్యుల నినాదాలు
- హుందాగా వ్యవహరించాలన్న స్పీకర్ ఓంబిర్లా
- రెండుసార్లు వాయిదా పడిన లోక్ సభ
- మూడోసారి సమావేశమైనా అదే పరిస్థితి
ఈ క్రమంలో కనీసం పట్టుమని ఐదు నిమిషాలు కూడా సభ సజావుగా సాగలేదు. విపక్షాల ఆందోళనతో లోక్ సభ రెండుసార్లు వాయిదా పడింది. మూడోసారి భేటీ తర్వాత కూడా విపక్షాలు ఆందోళనకు దిగాయి. హుందాగా వ్యవహరించి సభా మర్యాదలను కాపాడాలని స్పీకర్ ఓం బిర్లా పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. వెల్ వద్దకు వెళ్లిన సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.