Telugudesam: మేనిఫెస్టోపై వివ‌ర‌ణ ఇవ్వండి: టీడీపీకి ఎస్ఈసీ నోటీసులు

  • ఇప్ప‌టికే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
  • వ‌చ్చేనెల‌ 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలన్న ఎస్ఈసీ
  • మేనిఫెస్టో విడుద‌ల‌ సరైనది కాదని వ్యాఖ్య‌
sec gives notice to tdp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ప‌ల్లె ప్ర‌గ‌తి-పంచ సూత్రాల పేరిట ఈ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. దీనిపై ఇప్ప‌టికే ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేయడం స‌రికాద‌ని వ్యాఖ్యానించింది.

ఈ నేప‌థ్యంలో టీడీపీ మేనిఫెస్టో విడుదలపై ఆ పార్టీ వివరణ ఇవ్వాల‌ని ఆదేశిస్తూ  ఎస్‌ఈసీ టీడీపీకి నోటీసులు జారీచేసింది. వ‌చ్చేనెల‌ 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని తెలిపింది. పార్టీలకు అతీతంగా జరిగే స్థానిక‌ ఎన్నికలలో మేనిఫెస్టో సరైనది కాదని ఎస్ఈసీ అంటున్నారు.

More Telugu News