ఏపీ కరోనా అప్ డేట్: 179 కొత్త కేసులు, ఒకరి మృతి

AP Corona Statistics
  • గత 24 గంటల్లో 39,099 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 కేసులు
  • అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు
  • 1,660కి తగ్గిన యాక్టివ్ కేసుల సంఖ్య
ఏపీలో గడచిన 24 గంటల్లో 39,099 కరోనా పరీక్షలు నిర్వహించగా 179 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 40 కేసులు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 35, గుంటూరు జిల్లాలో 24 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు నమోదైంది. నెల్లూరు జిల్లాలో 3, ప్రకాశం జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 6 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 231 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 8,86,245 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,77,443 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 1,660కి తగ్గింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,142కి చేరింది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Statistics
Positive Cases

More Telugu News