GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్ ఇవిగో!

  • అత్యధిక సీట్లను గెలవనున్న టీఆర్ఎస్
  • గ్రేటర్ లో భారీగా పుంజుకోనున్న బీజేపీ
  • ఓట్ షేర్ తక్కువ ఉన్నా ఎక్కువ సీట్లను కైవసం చేసుకోనున్న ఎంఐఎం
GHMC elections Exit Polls

జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో వేడి పుట్టించాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎంను బీజేపీ టార్గెట్ చేయడంతో ప్రచార పర్వం యుద్ధ రంగాన్ని తలపించింది. ఈ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్, ఆరా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. టీఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లను గెలుచుకోబోతున్నట్టు ఆ సంస్థలు వెల్లడించాయి.

పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వివరాలు:

  • టీఆర్ఎస్: 68 నుంచి 78 డివిజన్లలో జయకేతనం ఎగురవేస్తుంది. 38 శాతం ఓట్ షేర్ ను కైవసం చేసుకుంటుంది.
  • ఎంఐఎం: 38 నుంచి 42 వరకు సీట్లను కైవసం చేసుకుంటుంది. 13 శాతం ఓట్ షేర్ సాధించనుంది.
  • బీజేపీ: 25 నుంచి 35 డివిజన్లలో గెలుస్తుంది. ఓట్ షేర్ మాత్రం 32 శాతం వరకు వచ్చే అవకాశం ఉంది.
  • కాంగ్రెస్: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒకటి నుంచి 5 సీట్ల వరకు గెలుచుకుంటుంది. 12 శాతం వరకు ఓట్ షేర్ వస్తుంది.
  • ఇతరులు 5 శాతం వరకు ఓట్ షేర్ సాధించే అవకాశం ఉంది.

గత ఎన్నికల కంటే బీజేపీ భారీగా పుంజుకుందని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుందని అభిప్రాయపడింది.

ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్:
  • టీఆర్ఎస్:  78 (అటూ ఇటుగా 7 స్థానాలు) సీట్లు గెలుస్తుంది. ఓట్ షేర్ 40.08 శాతం.
  • ఎంఐఎం: 41 (అటూ ఇటుగా 5 స్థానాలు) వస్తాయి. ఓట్ షేర్ 13.43 శాతం.
  • బీజేపీ: 28 ( అటూ ఇటుగా 5 సీట్లు) స్థానాలు గెలుచుకుంటుంది. ఓట్ షేర్ 31.21 శాతం.
  • కాంగ్రెస్: 3 (అటూ ఇటుగా 3 సీట్లు) స్థానాలను గెలుచుకుంటుంది. ఓట్ షేర్ 8.58 శాతం.

More Telugu News