బీజేపీలో చేరిన టీఎంసీ అసంతృప్త ఎమ్మెల్యే గోస్వామి
- బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు
- పార్టీ ప్రారంభం నుంచి టీఎంసీలోనే ఉన్న మిహిర్ గోస్వామి
- పార్టీలో తనకు అవమానం జరిగిందన్న ఎమ్మెల్యే
ఈ సందర్భంగా గోస్వామి మాట్లాడుతూ.. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి మమత బెనర్జీకి పంపినట్టు తెలిపారు. టీఎంసీలో తనకు సరైన గుర్తింపు దక్కలేదని, పార్టీలో తనను అవమానించారని ఆరోపించారు. కాగా, టీఎంసీ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి అందులోనే ఉన్న గోస్వామి కాషాయ పార్టీ జెండా పుచ్చుకోవడం టీఎంసీకి ఎదురుదెబ్బేనని చెబుతున్నారు.