హైదరాబాద్ ప్రజలకు నా విజ్ఞప్తి: సీపీ అంజనీ కుమార్ వీడియో!
- శాంతిని భగ్నం చేసేందుకు దుష్టుల కుట్ర
- సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు
- ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న సీపీ
"హైదరాబాద్ నగరం ఇప్పుడు ఎన్నికల క్రమంలో ఉంది. ప్రజల మనసులను గెలుచుకుని ఓట్లు పొందాలని అందరు నేతలూ ఎంతో శ్రమిస్తున్నారు. ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేవాలయం వంటిది. ఈ సమయంలో కొందరు దుష్టులు ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. వారిని మీరు నమ్మవద్దు. ఏ విషయం మీ దృష్టికి వచ్చినా మాకు తెలియజేయండి" అన్నారు. అంజనీ కుమార్ వీడియోను మీరూ చూడవచ్చు.