Crackers: బాణసంచా కాల్చడంపై ఏయే రాష్ట్రాల్లో... పూర్తి బ్యాన్? షరతులతో నిషేధం? అసలు నిషేధం లేదు?

  • కరోనా కారణంగా బాణసంచాపై నిషేధం విధించిన పలు రాష్ట్రాలు
  • కొన్ని రాష్ట్రాల్లో షరతులతో కూడిన అనుమతి
  • పూర్తిగా అనుమతించిన తమిళనాడు, మధ్యప్రదేశ్
Which states in India banned fire crackers

దీపావళి పండుగ అంటేనే ఎక్కడ లేని సందడి ఉంటుంది. పూజలు, పిండి వంటలు, బంధుమిత్రుల కలయికలు, అందమైన దీపాలు, మిరమిట్లు గొలిపే బాణసంచా పేలుళ్లు... ఇవన్నీ కలస్తేనే దీపావళి. కానీ, కరోనా కారణంగా ఈ ఏడాది పలు రాష్ట్రాలు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించాయి. ప్రజలు కూడా ఈ ఏడాది బాణసంచా కాల్చడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బాణసంచా షాపులు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ఏయే రాష్ట్రాలు బాణసంచాను కాల్చడాన్ని పూర్తి నిషేధం విధించాయి?  ఏయే రాష్ట్రాలు పాక్షిక నిషేధం విధించాయి? టపాసులు కాల్చడాన్ని ఏయే రాష్ట్రాలు అనుమతించాయి? అనే విషయాన్ని తెలుసుకుందాం.

బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం విధించిన రాష్ట్రాలు: ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్థాన్, చండీగఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, సిక్కిం.

షరతులతో అనుమతించిన రాష్ట్రాలు:
ఆంధ్రప్రదేశ్: రాత్రి 8 నుంచి10 గంటల మధ్యలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు.
తెలంగాణ: రాత్రి 8 నుంచి 10 గంటల వరకు.
కర్ణాటక: గ్రీన్ క్రాకర్స్ మాత్రమే.
ఉత్తరప్రదేశ్: ఓ మోస్తరు గాలి కాలుష్యం ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్ కు మాత్రమే అనుమతి.
బీహార్:  ఓ మోస్తరు గాలి కాలుష్యం ఉన్న నగరాల్లో గ్రీన్ క్రాకర్స్ కు మాత్రమే అనుమతి.  
హర్యానా: నేషనల్ క్యాపిటల్ రీజన్ వెలుపల ఉన్న ప్రాంతాల్లో రెండు గంటలు అనుమతి.
చత్తీస్ గఢ్: రాత్రి 8 నుంచి 10 గంటల వరకు.
జార్ఖండ్: గ్రీన్ క్రాకర్స్ మాత్రమే.
ఉత్తరాఖండ్: కొన్ని నగరాల్లో రెండు గంటల పాటు గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు అనుమతి.
గుజరాత్: అహ్మదాబాద్ లో కేవలం రెండు గంటల పాటు అనుమతి.
అసోం: రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి.
పంజాబ్: రాత్రి 8 నుంచి 10 గంటల వరకు గ్రీన్ క్రాకర్స్ కు అనుమతి.

బాణసంచా కాల్చడానికి పూర్తి అనుమతి ఇచ్చిన రాష్ట్రాలు: మధ్యప్రదేశ్, తమిళనాడు.

More Telugu News