keeravani: తెలంగాణ పోలీసుల కోసం పాట పాడిన కీరవాణి.. అద్భుతం అంటోన్న నెటిజన్లు!

  • పాటను రాసిన గేయ రచయిత అనంత శ్రీరామ్ 
  • అక్టోబర్‌ 21 నుండి 31 వరకు పోలీస్‌ ఫ్లాగ్‌ డే
  • ఈ సందర్భంగా నిన్న పాట విడుదల  
keeravani sing a song for police

తెలంగాణ పోలీసుల కోసం సంగీత దర్శకుడు కీరవాణి పాటపాడారు. ఈ పాటను గేయ రచయిత అనంత శ్రీరామ్ రాశారు.  పోలీస్‌ పోలీస్‌.. తెలంగాణ పోలీస్.. ప్రాణం పంచే మనసున్న పోలీస్‌.. అంటూ సాగుతోన్న ఈ పాట తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి చేతుల మీదుగా విడుదలైంది.

అక్టోబర్‌ 21 నుండి 31 వరకు పోలీస్‌ ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న ఈ పాటను విడుదల చేశారు. ఈ పాట ఆవిష్కరణలో కీరవాణి కూడా పోలీసులతో కలిసి పాల్గొన్నారు. ఈ పాట రాయడం తన పూర్వజన్మ సుకృతమని  అనంత శ్రీరామ్ చెప్పారు. తెలంగాణ పోలీసులు ప్రజలకు అందిస్తోన్న సేవలను డీజీపీ మహేందర్ రెడ్డి కొనియాడారు.

More Telugu News