Manchu vishnu: 'మోసగాళ్లు' టీజర్‌ విడుదల చేసిన అల్లు అర్జున్.. టీజర్‌లో ట్రంప్ ప్రస్తావన!

  • ఐటీ కుంభకోణం నేపథ్యంలో సినిమా
  • మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో చిత్రం
  • అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో సాగే టీజర్‌ 
mosagallu teaser releases

ఐటీ కుంభకోణం నేపథ్యంలో మంచు విష్ణు, కాజల్‌ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటోన్న 'మోసగాళ్లు'  సినిమా టీజర్‌ను హీరో అల్లు అర్జున్‌ తన సోషల్ ‌మీడియా వేదికగా ఈ రోజు ఉదయం విడుదల చేశారు. తన బాల్య స్నేహితుడు, స్కూల్‌మేట్‌ విష్ణు మంచుకి, కాజల్‌ అగర్వాల్‌కి, ఈ సినిమా‌ యూనిట్‌కి అభినందనలు అంటూ అల్లు అర్జున్ ఈ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ను అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో కట్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తోన్న ప్రకటనతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది.   450 మిలియన్‌ డాలర్ల స్కామ్‌కు పాల్పడిన నిందితులను కనిపెట్టి త్వరలోనే పట్టుకుంటామని ఆయన అందులో చెబుతారు. నవదీప్‌, బాలీవుడ్ నటుడు సునీల్‌ శెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.   జెఫ్రీ గీ చిన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News