YSRCP: కరోనా బారిన పడ్డ మరో వైసీపీ ఎమ్మెల్యే

  • సత్యవేడు వై‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకి కరోనా లక్షణాలు
  • వైద్యులను సంప్రదించిన ఎమ్మెల్యే
  • తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
ycp mla tests corona positive

ఆంధ్రప్రదేశ్‌లో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. సత్యవేడు వై‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం  ఆయనకు తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కరోనాకు చికిత్స అందుతోందని తెలిసింది. కాగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకోగా, మరి కొందరు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుని కోలుకున్నారు.

More Telugu News