నెల్లూరులో ఎస్పీ బాలూకు గుర్తుగా స్మారక యోచన: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- నెల్లూరులో జన్మించిన బాలసుబ్రహ్మణ్యం
- స్మారకం ఏర్పాటుపై త్వరలోనే ప్రకటన
- అంత్యక్రియలకు హాజరైన అనిల్ కుమార్
"గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున నివాళులర్పించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటు చేసేందుకు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం- మంత్రి అనిల్" అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసింది.