Rashmika Mandanna: మెగా హీరో చిత్రంలో బాలీవుడ్ భామ స్థానంలో రష్మిక!

  • టాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా రష్మిక 
  • అల్లు అర్జున్ 'పుష్ప'లో కథానాయిక
  • వరుణ్ తేజ్ 'బాక్సర్' కోసం సంప్రదింపులు  
Rashmika is considered for Mega hero movie

ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ల జాబితాలో వున్న ముగ్గురు, నలుగురు కథానాయికలలో రష్మిక కూడా వుంది. 'భీష్మ', 'సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస విజయాలతో ఈ ముద్దుగుమ్మ మంచి డిమాండులోకి వచ్చింది. దాంతో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రంలో ఆమెను తీసుకున్నారు. దీంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది.

ఈ క్రమంలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న చరణ్ సరసన కూడా రష్మికను తీసుకోవాలని చిత్ర నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇదిలావుండగానే, మెగా ఫ్యామిలీకి చెందిన మరో హీరో వరుణ్ తేజ్ సరసన కూడా ఆమె నటించే అవకాశం వుందని తెలుస్తోంది.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ 'బాక్సర్' టైటిల్ తో ఓ స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నాడు. ఇందులో కథానాయికగా మొదట్లో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ ను తీసుకున్నారు. అయితే, తాజాగా ఆమె స్థానంలో రష్మికను ఈ ప్రాజక్టులోకి తీసుకురావాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వస్తుంది.    

More Telugu News