KCR: జీహెచ్ఎంసీ ఎన్నికలపై సర్వే చేయించా.. మనం ఎన్ని సీట్లు గెలుచుకుంటామంటే..?: కేసీఆర్

  • 94 నుంచి 104 సీట్లను గెలుచుకుంటాం
  • కాంగ్రెస్ రోజురోజుకూ బలహీనంగా తయారవుతోంది
  • బీజేపీ మరో ఒకటో, రెండో సీట్లు గెలుచుకోవచ్చు
TRS will win 94 to 104 seats in GHMC elections says KCR

త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ఈ ఎన్నికలకు సంబంధించి సర్వే చేయించానని... టీఆర్ఎస్ పార్టీ 94 నుంచి 104 సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉందని తెలిపారు. రోజురోజుకూ ఆ పార్టీ వీక్ గా తయారవుతోందని చెప్పారు. బీజేపీకి ఇప్పుడున్న స్థానాల కంటే మరో ఒకటి, రెండు సీట్లు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

మరోవైపు, గత గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు 99 సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరోసారి పార్టీ గ్రాండ్ విక్టరీపై ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News