Car: కూకట్ పల్లిలో కారు బీభత్సం... ఒకరి మృతి

  • మియాపూర్ నుంచి అమీర్ పేట వైపు వెళుతున్న కారు
  • ఒక్కసారిగా అదుపుతప్పిన వైనం
  • ఇద్దరు పాదచారులను ఢీకొట్టిన కారు
Speeding car hits many vehicles in Kukatpalli

హైదరాబాదులో మియాపూర్ నుంచి అమీర్ పేట వైపు వెళుతున్న ఓ కారు కూకట్ పల్లి వద్ద ఒక్కసారిగా అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. మొదట... రోడ్డు దాటుతున్న ఇద్దరిని ఢీకొట్టగా వారిలో ఒకరు మరణించారు. ఆపై కారు మరింత వేగంగా వెళ్లి మరో కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా ఓ ఆటోను, మరో బైక్ ను ఢీకొట్టడంతో అందరూ హడలిపోయారు. ఈ సందర్భంగా కారులో ఉన్నవారు కూడా గాయపడ్డారు. ఈ ప్రమాదాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదాలకు కారకులైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News