చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం
- బెంగళూరు నుంచి నెల్లూరు వస్తుండగా ఘటన
- స్వల్పగాయాలతో బయటపడిన కోడలు
- కారులో మృతి చెందిన తల్లిదండ్రులు, కుమారుడు
ఈ క్రమంలో బంగారుపాళ్యం మండలంలోని బలిజపల్లి సమీపంలో ఓ ద్విచక్రవాహనం వీరి కారును ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు పక్కనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న శ్రీనివాసులు రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రత్నమ్మలు ప్రాణాలు కోల్పోగా, శిరీష స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరోవైపు, కారును ఢీకొట్టిన బంగారుపాళ్యం మండలం తగ్గువారిపల్లెకు చెందిన సయ్యద్ హుస్సేన్ (48) కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.