KTR: 'ఈ ఆరుగురు అక్కాచెల్లెళ్లు అనాథలయ్యారు' అంటూ ట్వీట్.. స్పందించిన కేటీఆర్

  • పెంచికల్ పేట్ మండలానికి చెందిన అమ్మాయిలు
  • తల్లిదండ్రులు మృతి
  • వారి బాగోగులను చూసుకుంటామని కేటీఆర్ హామీ
ktr helps sisters in penchikal

ట్విట్టర్‌ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స్పందిస్తూ ప్రజల కష్టాలు తీర్చుతున్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు తాజాగా ఒకరు ఓ ట్వీట్ చేశారు. 'పెంచికల్ పేట్ మండలంలోని ఎల్కపల్లి గ్రామం తోటపల్లి రాజ్యం భూమి లేని ఓ నిరుపేద దళిత కూలి కుటుంబం ఇది' అంటూ అందులో పేర్కొన్నారు. గత సంవత్సరం అనారోగ్యంతో ఆ కూలీ మృతిచెందగా అతని భార్య కూడా గత వారం రోజుల క్రితం మృతి చెందిందని చెప్పారు.

వీరి ఆరుగురు ఆడ పిల్లలు అనాథలయ్యారని, తల్లిదండ్రులు మరణించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఒకరు చేసిన ఈ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందించారు. 'వారి బాగోగులను మేము చూసుకుంటాం' అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు. స్థానిక కలెక్టర్‌ను సంప్రదించి ఇందుకు తగ్గ ఏర్పాట్లు జరిగేలా చూడాలని తన కార్యాలయ సిబ్బందిని కేటీఆర్‌ ఆదేశించారు.

More Telugu News