అద్వానీ, జోషిలకు అందని 'అయోధ్య' ఆహ్వానం!
- ఈ నెల 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమిపూజ
- ఉమాభారతి, కల్యాణ్ సింగ్ లకు ఆహ్వానం
- కార్యక్రమానికి హాజరుతామన్న ఉమ, కల్యాణ్ సింగ్
మరోపక్క, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ లకు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఉమాభారతి, కల్యాణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, 1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన గురించి తాము ఏమాత్రం చింతించమని చెప్పారు. భూమిపూజకు తాము హాజరవుతామని తెలిపారు.
మరోవైపు మసీదు కూల్చివేత కేసుకు సంబంధించి సీబీఐ కోర్టు వీడియో విచారణకు ఇటీవల అద్వానీ, జోషి, ఉమాభారతి హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఉమాభారతి మాట్లాడుతూ, ఎలాంటి తీర్పు వెలువడినా స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనను ఉరి తీసినా సంతోషమేనని అన్నారు.