మా ఏరియాలో ఉన్న అందరి కరెంటు బిల్లూ నాకే పంపారా?: హర్భజన్ సింగ్
- హర్భజన్ కు రూ. 33,900 కరెంట్ బిల్లు
- అదానీ ఎలెక్ట్రిసిటీపై అసహనం వ్యక్తం చేసిన వెటరన్ స్పిన్నర్
- కరోనా కాలంలో జనాల కష్టాలు పెంచుతున్నారని వ్యాఖ్య
ఇప్పటికే కరోనాతో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారని... భారీ కరెంట్ బిల్లులతో విద్యుత్ సంస్థలు జనాలను మరింత కష్టపెడుతున్నాయని అన్నాడు. హర్భజన్ కు ఈ నెల కరెంట్ బిల్లు రూ. 33,900 వచ్చింది. వచ్చే నెల 17వ తేదీలోగా బిల్లు కట్టాలని పేర్కొన్నారు.
కరోనా సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో భారీగా కరెంట్ బిల్లులు వస్తున్న సంగతి తెలిసిందే. కొందరికి లక్షల్లో కూడా బిల్లులు వచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.