YS Vivekananda Reddy: హత్య కేసులో దర్యాప్తు.. పులివెందులలోని వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ అధికారులు

  • అక్కడి నుంచి పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి అధికారులు
  • కేసుకు సంబంధించిన వివరాల సేకరణ
  • గత ఏడాది వివేకానందరెడ్డి సొంతింట్లోనే దారుణ హత్య
cbi probe on viveka murder case

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు వివేకా హత్యకేసు వివరాలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం పులివెందులలోని వివేకా ఇంటిని సీబీఐ అధికారులు పరిశీలించి, అక్కడి నుంచి పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.

ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నారు. గత ఏడాది మార్చి 15న వివేకానందరెడ్డి సొంతింట్లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించగా, మొత్తం 1,300 మంది అనుమానితులను సిట్‌ అధికారులు విచారించారు.

అయినప్పటికీ ఈ కేసును ఛేదించలేకపోయారు. ఈ కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించడంతో, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.

More Telugu News