Vijay Sai Reddy: బయలుదేరిన టీడీపీ మిడతల దండు... బీజేపీ ఎలా బయటపడుతుందో?: విజయసాయి రెడ్డి

  • ఏడాది కాలంగా తినేందుకు ఏమీ దొరకలేదు
  • నకనకలాడుతూ కమలం పువ్వు వైపు కదులుతున్నారు
  • ఇప్పటికే కొన్ని మిడతలు విధ్వంసం సృష్టిస్తున్నాయి
Vijaya Sai Satires on Telugudesam Leaders

తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఇప్పటికే బీజేపీలో చేరగా, మరికొందరు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వస్తున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నక నక లాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతోంది. ఇప్పటికే కొన్ని మిడతలు ఆ పార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయల్దేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి" అని వ్యాఖ్యానించారు.

More Telugu News