కరోనాకు పతంజలి మందు .. మార్కెట్లో విడుదల చేసిన రాందేవ్ బాబా!
- కోరోనిల్ పేరుతో మార్కెట్లోకి విడుదల
- కృషి చేసిన శాస్త్రవేత్తలకు రామ్దేవ్ అభినందనలు
- ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది
- మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ
ఈ మందును తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంలో కరోనాకు మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు. క్లినికల్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ మందును తీసుకొచ్చామని వివరించారు. మూడు రోజుల్లో ఈ మందుతో చాలా మంది కోలుకున్నారని చెప్పారు.