Uttar Pradesh: మతిస్థిమితం లేని మహిళపై యువకుల అమానుష దాడి.. వీడియో వైరల్!

  • ఉత్తర ప్రదేశ్‌లో ఘటన
  • ఆకలితో బాధపడుతూ ఫరూఖాబాద్‌లో కనపడిన మహిళ
  • ఏడుస్తూ కేకలు పెడుతున్నా వదలకుండా కొట్టిన యువకులు
  • పోలీసు కేసు నమోదు
miscreants drag mentally ill woman by hair

మతిస్థిమితం లేని ఓ మహిళను ఇద్దరు యువకులు దారుణంగా రాళ్లతో కొట్టిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మానవత్వం మరిచి ఆమెపై వారు చేసిన ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జుట్టు పట్టి లాగుతూ వారు ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆ మహిళ ఆకలితో బాధపడుతూ ఫరూఖాబాద్‌లోని తిర్వా కాలనీకి వెళ్లిందని, ఆమెను యువకులు చితక్కొట్టారని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో ఆ మహిళ ఏడుస్తూ కేకలు పెడుతున్నా వారు కనికరం లేకుండా గొడ్డును బాదినట్లు బాదారు. చివరకు ఆ మహిళకు అండగా స్థానికులు రావడంతో ఆ యువకులు పారిపోయారు.

More Telugu News