Santosh: నిజంగా వీరమాతే!... దేశం కోసం తన కొడుకు అమరుడైనందుకు గర్వంగా ఉందన్న కల్నల్ సంతోష్ తల్లి

  • లడఖ్ వద్ద చైనా బలగాలతో ఘర్షణలో కల్నల్ సంతోష్ మరణం
  • తన కోడలి ద్వారా ఈ విషయం తెలిసిందన్న సంతోష్ తల్లి
  • అంతటి విషాదంలోనూ నిబ్బరంగా మాట్లాడిన మాతృమూర్తి
Martyred Colonel Santosh mother talks to media

లడఖ్ వద్ద గాల్వన్ లోయలో చైనా బలగాలతో భారత సైనికులకు గతరాత్రి ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన బి.సంతోష్ అనే కల్నల్ ర్యాంకు అధికారి కూడా మృతి చెందారు. తన కుమారుడి మరణవార్తపై సూర్యాపేటలో ఉన్న ఆయన తల్లి స్పందించారు.

తనకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారని, ఆ ఒక్క కొడుకూ ఇప్పుడు అమరుడయ్యాడని ఆమె అన్నారు. తల్లిగా బిడ్డను కోల్పోయిన బాధ ఉన్నా, తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం పట్ల గర్వంగా వుందని పుట్టెడు దుఃఖాన్ని భరిస్తూ నిబ్బరంగా చెప్పారు. తనకు ఈ విషయం ఇవాళ మధ్యాహ్నం తెలిసిందని, ఢిల్లీలో ఉన్న తన కోడలికి నిన్న రాత్రే ఈ విషయం తెలిసినా, తాను తట్టుకోలేనని ఇవాళ్టి వరకు చెప్పలేదని ఆమె వివరించారు.


More Telugu News