గాంధీ విగ్రహాన్ని పాడుచేయడం అవమానకరం: ట్రంప్
- జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత అమెరికాలో అల్లర్లు
- వాషింగ్టన్ లో గాంధీ విగ్రహానికి రంగు పులిమిన ఆందోళనకారులు
- ఘటనపై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్
కాగా, విగ్రహాన్ని కొందరు వ్యక్తులు అపవిత్రం చేశారంటూ భారత రాయబార కార్యాలయం వాషింగ్టన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అటు అమెరికా ప్రభుత్వానికి కూడా ఘటనపై వివరాలు అందించింది. దాంతో అమెరికా ప్రభుత్వం భారత్ ను క్షమాపణలు కోరింది. అమెరికా చట్ట సభల సభ్యులు కూడా గాంధీ విగ్రహంపై దుశ్చర్యను ఖండించారు. ఇలాంటి ఘటనలు విచారకరం అంటూ ట్రంప్ సలహాదారు కింబర్లీ గిల్ ఫోయిల్ ట్వీట్ చేశారు.