ఈ ప్రపంచంలో నేను ఎవరిని అభిమానించాలనేది నా ఇష్టం: మీరా చోప్రా
- మీరా చోప్రాపై వేధింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
- సోషల్ మీడియా దుర్భర ప్రదేశంగా మారిందని ఆవేదన
ఈ ప్రపంచంలో ఎవరిని అభిమానించాలనేది తన ఇష్టం అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఇప్పుడొక దుర్భరమైన ప్రదేశంగా మారిపోయిందని, ఈ వివాదం మొదలయ్యాక తనకు వేధింపులు, బెదిరింపులతో కూడిన 30 వేల ట్వీట్లు వచ్చాయని వెల్లడించారు.
ఈ సైబర్ వేధింపులపై స్పందించకపోతే తప్పు చేసినట్టేనని, అందుకే హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, తాను ఢిల్లీలో నివాసం ఉంటుండడంతో అక్కడ కూడా ఫిర్యాదు చేశానని మీరా చోప్రా వివరించారు. హీరోలు తమ అభిమానుల గ్రూప్ ల గురించి తెలుసుకోవాలని, ఇలాంటి ధోరణులను ఖండించాలని అన్నారు. హీరోలు చెబితే ఫ్యాన్స్ కచ్చితంగా వింటారని మీరా అభిప్రాయపడ్డారు.