Srishailam: శ్రీశైలం దేవస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

  • శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ.2.12 కోట్ల స్కాం
  • 27 మంది అరెస్ట్
  • డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా మోసాలు
Police busts Srishailam scam

శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో కోట్ల విలువైన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కుంభకోణంలో నిందితులపై 4 కేసులు నమోదు చేశారు. నాలుగు కేసుల్లో మొత్తం 27 మంది నిందితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్టు గుర్తించారు. షిఫ్ట్ బిఫోర్ క్లోజింగ్, లాగిన్ ఐడీ చేంజ్ ద్వారా ఈ మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది. ఈ కుంభకోణంలో మొత్తం రూ.2.12 కోట్లు స్వాహా జరిగినట్టు తేల్చారు. పోలీసులు ఇప్పటివరకు రూ.83.40 లక్షలు రికవరీ చేశారు. కాగా, నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

More Telugu News