Drushyam: నాటి భారీ హిట్ కు సీక్వెల్ వస్తోంది!

  • మోహన్ లాల్ హీరోగా మలయాళంలో 'దృశ్యం' 
  • ఆకట్టుకున్న చక్కని కథ, మంచి స్క్రీన్ ప్లే
  • వెంకటేశ్, మీనా జంటగా తెలుగులో రీమేక్ 
  • మలయాళంలో సీక్వెల్ చేస్తున్న జీతూ జోసెఫ్  
Sequel on cards for Drushyam

ఆరేళ్ల క్రితం మలయాళంలో వచ్చిన 'దృశ్యం' చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసింది. మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తక్కువ బడ్జెట్టులో నిర్మించిన ఈ థ్రిల్లర్ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా అదే పేరుతో రీమేక్ చేయగా, ఇక్కడ కూడా మంచి హిట్టయింది. ఆ తర్వాత హిందీలో రీమేక్ చేయగా, అక్కడ కూడా విజయాన్ని సాధించింది. చక్కని కథ, మంచి పట్టుతో కూడిన స్క్రీన్ ప్లే సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాయి.  

ఈ నేపథ్యంలో ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి మలయాళంలో సీక్వెల్ నిర్మించే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ మీడియాకు వెల్లడించారు. సీక్వెల్ లో కూడా మోహన్ లాల్, మీనా జంటగా నటిస్తారని చెప్పారు. ఈ సీక్వెల్ లో తొలి భాగంలో లేని పలు కొత్త క్యారెక్టర్లు కనిపిస్తాయని అన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు.  

More Telugu News