ఏపీలో స్కూళ్లు ఆగస్టు 3న ప్రారంభం
- కరోనా వ్యాప్తితో మార్చి నెలాఖరు నుంచి మూతపడిన విద్యాసంస్థలు
- తాజాగా వేసవి సెలవులు మరింత పొడిగించిన ఏపీ సర్కారు
- ఆగస్టు నుంచి తగిన జాగ్రత్తలతో స్కూళ్లు నడపాలని సీఎం ఆదేశం
కాగా, ప్రతి స్కూల్లో 9 రకాల సదుపాయాలు కచ్చితంగా కల్పించాలని, అందుకోసం రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను కూడా విడుదల చేశామని చెప్పారు. స్కూళ్లకు సెలవులు పొడిగించినందున ఈ విరామంలో సదుపాయాల కల్పన చేయాలని, జూలై 30 నాటికి స్కూళ్లన్నీ పూర్తి ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.