Tamil Nadu: కరోనా కేసులు పెరుగుతున్నా.. మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమిళనాడు!

  • ఈ నెల 7 నుంచి తమిళనాడులో మద్యం అమ్మకాలు
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు సేల్స్
  • కంటైన్మెంట్ ప్రాంతాల్లో అమ్మకాలు బంద్
Tamil Nadu to sell liquor from may 7

తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కూడా ఏకంగా కొత్తగా 233 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3 వేలు దాటింది. కేసులు ఈ స్థాయిలో పెరుగుతున్న తరుణంలో కూడా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 7 నుంచి మద్యం అమ్మకాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతాయని చెప్పింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని తెలిపింది.

More Telugu News