UV Blaster: క్రిమి నిర్మూలన టవర్ రూపొందించిన డీఆర్డీవో!

DRDO makes UV Blaster for jerm killing
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పరిశోధనాలయాలన్నీ ఇప్పుడు కరోనా నేపథ్యంలో నూతన ఆవిష్కరణలు తీసుకువస్తున్నాయి. భారత్ కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) కూడా ఈ కోవలో చేరింది. డీఆర్డీవో పరిశోధకులు తాజాగా అతి నీలలోహిత కిరణాలతో క్రిములను నిర్మూలించే ఓ టవర్ ను రూపొందించారు. దీనికి 'యూవీ బ్లాస్టర్' అని నామకరణం చేశారు.

కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డీఆర్డీవో పేర్కొంది. రసాయన రహితంగా క్రిములను నాశనం చేస్తుందని, ఓ గదిలో పది నిమిషాల పాటు దీన్ని ఉంచితే క్రిమివినాశనం జరుగుతుందని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.  దీన్ని 30 నిమిషాల పాటు ఆన్ లో ఉంచితే 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రదేశం క్రిమిరహితంగా మారుతుందనిపేర్కొంది.

ఈ ప్రత్యేక టవర్ ను మొబైల్ ఫోన్ ద్వారా గానీ, ల్యాప్ టాప్ ద్వారా గానీ నియంత్రించవచ్చు. వైఫై లింక్ ద్వారా పనిచేస్తుంది. రసాయనాలతో శుభ్రపరిచేందుకు వీలుకాని ప్రదేశాల్లో ఈ యూవీ బ్లాస్టర్ ఎంతో అనుకూలంగా ఉంటుందని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Go Back to Shorts
UV Blaster
DRDO
Corona Virus
Ultra Violet Rays
India

More Telugu News