AP High Court: నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా

  • ఎస్ఈసీ పదవి నుంచి రమేశ్ కుమార్ తొలగింపు
  • ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన ఏపీ సర్కారు
  • హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్
AP High Court adjourns hearing of Nimmagadda Ramesh petition

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనిపై రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇప్పటికే పలు దఫాలు వాదనలు విన్నది. తాజాగా జరిగిన విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఈ పిటిషన్ పై దాదాపు 5 గంటల పాటు వాదోపవాదాలు సాగాయి. పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఆదినారాయణ, వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. ఈ మేరకు కోర్టు ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి మరికొన్ని పిటిషన్లు ఉన్నందున, రేపటి విచారణలో మరికొందరు పిటిషనర్ల వాదనలు కూడా వినాలని హైకోర్టు భావిస్తోంది.

More Telugu News