Suresh Babu: 'హిరణ్య కశిప' వుందన్న సురేశ్ బాబు

  • ఒక సినిమా పూర్తయింది
  • ముగింపు దశలో మిగతా సినిమాల చిత్రీకరణ
  • 'హిరణ్యకశిప' ప్రాజెక్టు ఆగిపోలేదన్న సురేశ్ బాబు
Hiranya Kashipa Movie still on cards says Sureshbabu

సురేశ్ బాబు నిర్మాతగా .. రానా ప్రధాన పాత్రలో .. గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్య కశిప' రూపొందనుంది. చాలా కాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ చిత్రపరిశ్రమపై భారీగా పడిందనీ, అందువలన సురేశ్ బాబు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. దాంతో రానా అభిమానులు తీవ్రమైన నిరాశకి లోనయ్యారు.

ఈ నేపథ్యంలో తాజాగా సురేశ్ బాబు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'హిరణ్య కశిప' ప్రాజెక్టు ఆగిపోలేదనీ .. తమ బ్యానర్లో ఆ సినిమా ఉందని అన్నారు. అలాగే తమ బ్యానర్లో రానున్న 'కృష్ణ అండ్ హిజ్ లీల' ఫస్టు కాపీ వచ్చేసిందని చెప్పారు. 'నారప్ప'కు 25 శాతం చిత్రీకరణ మిగిలి ఉందనీ, 'విరాటపర్వం'కు ఇంకా 8 రోజుల షూటింగు మిగిలి ఉందని అన్నారు. రవిబాబు దర్శకత్వంలో నిర్మిస్తున్న 'క్రష్' సినిమా కూడా ఐదారు రోజుల వర్క్ మాత్రమే మిగిలివుందని చెప్పారు.

More Telugu News