Neeti Aayog: ఢిల్లీలోని నీతి ఆయోగ్ అధికారికి ‘కరోనా’ పాజిటివ్!

  • డైరెక్టర్ స్థాయి అధికారికి ‘కరోనా’పాజిటివ్
  • ఆయనతో కాంటాక్టులో వున్న వారికి క్వారంటైన్  
  • 48 గంటల పాటు కార్యాలయం మూసివేత 
Delhi Neeti Aayog employe attacks corona

ఢిల్లీలోని నీతి ఆయోగ్ కార్యాలయంలో పని చేసే డైరెక్టర్ స్థాయి అధికారికి ‘కరోనా’ పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సలహాదారు అలోక్ కుమార్ తెలిపారు. ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు వైద్య పరీక్షల నివేదిక వెలువడ్డ అనంతరం తనకు ‘కరోనా’ పాజిటివ్ వచ్చిన విషయాన్ని సంబంధిత అధికారులకు ఆయన తెలిపారని అన్నారు.

నిబంధనల మేరకు ఈ సమాచారాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు తెలియజేశామని అలోక్ కుమార్ వివరించారు. ఆ అధికారితో కాంటాక్టులో ఉన్న ప్రతి ఒక్కరినీ హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ కార్యాలయంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని, 48 గంటల పాటు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News