లాక్డౌన్కు వ్యతిరేకంగా అమెరికన్ల ఆందోళనపై ఆర్జీవీ కామెంట్
- ఎక్కువ కేసులు, మరణాలు ఉన్న దేశంలో లాక్డౌన్ వద్దంటున్నారు
- కరోనాపై ప్రభుత్వం అతి చేస్తోందని ఆరోపిస్తున్నారని ట్వీట్
- యూఎస్లో 8 లక్షలకు చేరువైన కరోనా కేసులు
‘అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన అమెరికాలో ప్రజలు లాక్డౌన్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. దేశాన్ని వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైరస్పై తమ ప్రభుత్వం అతి చేస్తోందని, తప్పుడు సమాచారం ఇస్తోందని ఆరోపిస్తున్నారు’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. యూఎస్లో ప్రజల ఆందోళనకు సంబంధించిన ఓ వీడియో లింక్ను కూడా ఆయన షేర్ చేశారు. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరువ అవగా, ఇప్పటికే 42 వేల పైచిలుకు మంది చనిపోయారు.