Lockdown: పేద ముస్లింలను ఆదుకోండి: కేసీఆర్‌కు అక్బరుద్దీన్ లేఖ

  • లాక్‌డౌన్ వల్ల పేద ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
  • 9 రోజులపాటు లాక్‌డౌన్‌లోనే ఉపవాసాలు
  • నిత్యావసరాలు అందించి ఆదుకోండి
Akbaruddin writes letter to CM KCR

లాక్‌డౌన్ వేళ రంజాన్ మాసం రావడంతో పేద ముస్లింలను ఆదుకోవాలంటూ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 25 నుంచే రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని, లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో 9 రోజులపాటు లాక్‌డౌన్‌లోనే ఉపవాస దీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ముస్లింలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,  కాబట్టి వారికి నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు పంపిణీ చేసి ఆదుకోవాలని అక్బరుద్దీన్ ఆ లేఖలో సీఎంకు విజ్ఞప్తి చేశారు.

More Telugu News