Vijayawada: విశాఖలో ఉన్న జపనీయులు బెంగళూరుకు తరలింపు!

  • మార్చి 23 నుంచి వైజాగ్ లో ఉండిపోయిన జపాన్ పౌరులు
  • ఛార్టెడ్ ఫ్లైట్ లో బెంగళూరుకు తరలింపు
  • అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో జపాన్ కు వెళ్లనున్న వైనం
Six Japanese stranded in Vizag return home

విశాఖలో ఉన్న ఆరుగురు జపాన్ పౌరులను అధికారులు నిన్న ఉదయం బెంగళూరుకు పంపించారు. మార్చి 23 నుంచి లాక్ డౌన్ సమయంలో వీరు విశాఖలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో  వీరిని ఒక ఛార్టెడ్ ఫ్లైట్ ద్వారా బెంగళూరుకు పంపించారు. అక్కడ ఇతర జపనీయులతో వారు జతకలుస్తారు. అనంతరం అక్కడి నుంచి అందరూ కలిసి ఒక ప్రత్యేక విమానంలో జపాన్ బయల్దేరుతారు. ఈ ప్రత్యేక విమానాన్ని జపాన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.

ఈ సందర్భంగా విశాఖ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ, నిన్న ఉదయం 10.35 గంటలకు ఎయిట్ సీటర్ ఛార్టెడ్ ఫ్లయిట్ లో జపాన్ పౌరులను బెంగళూరుకు పంపించామని చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో వారు విశాఖలోనే చిక్కుకుపోయారని తెలిపారు. ఈ రాత్రి వారంతా బెంగళూరు నుంచి జపాన్ కు వెళ్లిపోతారని చెప్పారు.

More Telugu News