Chiranjeevi: 'ఆచార్య' నుంచి త్రిష అందుకే తప్పుకుంది: చిరంజీవి

  • త్రిషకి ఎవరితోను గొడవలు లేవు
  • ఆమె మణిరత్నం సినిమా చేస్తోంది 
  • డేట్లు కుదరకనే తప్పుకుందన్న చిరూ 
chiranjeevi says why Trisha out from Acharya Movie

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య' రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా ముందుగా త్రిషను తీసుకున్నారు. ఆ తరువాత ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. తన పాత్ర ప్రాధాన్యతను తగ్గించారనే విషయంపై ఆమె యూనిట్ సభ్యుల పట్ల అసహనాన్ని వ్యక్తం చేసిందనీ, ఆ కారణంగానే ఆమె తప్పుకుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది.

తాజా ఇంటర్వ్యూలో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్న ఎదురుకావడంతో చిరంజీవి స్పందిస్తూ .. "ఈ విషయాన్ని గురించి నేను యూనిట్ సభ్యులతో మాట్లాడాను. ఎవరితోనూ ఆమెకి ఎలాంటి గొడవలేదు. ఏ విషయంపై ఎవరితోను విభేదాలు తలెత్తలేదు. మణిరత్నం  సినిమా కోసం ఆమె ఎక్కువ డేట్లు కేటాయించవలసి వచ్చింది. అందువల్లనే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. అంతేగానీ ఇందులో ఎలాంటి వివాదాస్పదమైన అంశం లేదు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News